నేలకొండపల్లి, అక్టోబర్ 4: మండల వ్యాప్తంగా ప్రజలు దసరా సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రం పట్టణంలోని పలు దేవాలయాలకు చెందిన ఉత్సవమూర్తుల విగ్రహాలను ప్రజలు దర్శించుకునేందుకు జమ్మిబండ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ప్రజలు స్వామి విగ్రహాలను దర్శించుకున్నారు. పట్టణంలో ఉత్సవమూర్తుల విగ్రహాల ఊరేగింపు సందర్భంగా కోలాట ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
చింతకాని, అక్టోబర్ 5: మండల వ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు గ్రామాల్లో ఆయుధ, జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. లచ్చగూడెంలో వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, సర్పంచ్ గురజాల ఝాన్సీ, సొసైటీ డైరక్టర్ తాతా ప్రసాద్, మాజీ సర్పంచులు కొప్పుల గోవిందరావు, గోడుగు రమేశ్ ఆధ్వర్యంలో జమ్మిచెట్టుకు పూజలు చేశారు.
తిరుమలాయపాలెం, అక్టోబర్ 5: మండలంలోని పిండిప్రోలులో అమ్మవారి మండపంలో ఎమ్మెల్సీ తాతా మధు, సతీమణి భవానితో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుమలాయపాలెం సొసైటీ వైస్ చైర్మన్ చామకూరి రాజు, ఎంపీటీసీ పులుగుజ్జు వెంకటేశ్వర్లు, పరికపల్లి చంద్రశేఖర్, దూదిమెట్ల శ్రీను, తాతా రవీందర్, చామకూరి వెంకటేశ్వర్లు, కిరణ్, శరత్, సునీల్ పాల్గొన్నారు.
కూసుమంచి, అక్టోబర్ 5: విజయ దశమి సందర్భంగా బుధవారం ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. జీళ్లచెరువు జమ్మిపూజలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి విజయమ్మ, కుటుంబ సభ్యులు, జడ్పీటీసీ ఇంటూరి బేబీ, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, సర్పంచ్ కొండా సత్యం, ఎంపీటీసీ అంబాల ఉమ, చైర్మన్ బొడ్డు నరేందర్ పాల్గొన్నారు. కూసుమంచి శివాలయంలో ఎంపీడీవో కరుణాకర్రెడ్డి, ఎంపీవో రామచందర్రావు, సర్పంచ్ చెన్నా మోహన్రావు, ఏపీవో అప్పారావు పాల్గొన్నారు.
కూసుమంచి, అక్టోబర్ 5: కూసుమంచిలోని రామాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. రామాలయం కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. బుధవారం 9 రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో భక్తులో దర్శనమిచ్చారు.
ముదిగొండ అక్టోబర్ 5: దేవి శరన్నవాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన విజయ దశమి పండుగను మండలంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తోట నాగరాజు ఆయుధ పూజ చేశారు.