సత్తుపల్లి, సెప్టెంబర్ 26: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఇలాంటి పథకాలు తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ఇటీవల కేంద్రం ప్రకటించిన ఉత్తమ గ్రామాలు, పట్టణాల్లో సింహభాగం తెలంగాణలోనివేనని అన్నారు. దేశంలో 20 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేయగా అందులో 17 తెలంగాణలోనివేనని, ఉత్తమ పట్టణాలు కూడా ఎక్కువశాతమే ఉన్నాయని గుర్తుచేశారు.
సత్తుపల్లి పట్టణంలో సోమవారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. 4, 8, 9, 12 వార్డుల్లో నూతన పింఛన్ మంజూరు కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలకూ సమాన గౌరవ ఇస్తోందని అన్నారు. సత్తుపల్లిలో రూ.35 కోట్లతో 100 బెడ్ల ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా సాగుతోందన్నారు. సత్తుపల్లి పట్టణ అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ రూ.30 కోట్లకుపైగా నిధులు మంజూరుచేయగా ఇప్పటికే ఆ పనులు ప్రారంభమయ్యాయన్నారు.
సింగరేణి
బాధితులను ఆదుకుంటాం..
సింగరేణి బాంబ్ బ్లాసింగ్ వల్ల నష్టపోతున్న ఎన్టీఆర్నగర్, వెంగళరావునగర్ కాలనీల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. సోమవారం ఆయా కాలనీల్లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్లను ఇప్పటికే గుర్తించామని, సింగరేణి అధికారులతో చర్చించామని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరావు, సుజాత, జానిమియా, నరేశ్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, సుజాత, కూసంపూడి మహేశ్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, తోట సుజలారాణి, గాదె సత్యం, చల్లగుళ్ల కృష్ణయ్య, రఫీ, అంకమరాజు, మిద్దే శ్రీను, నాగభూషణం, బుడేన్, వలీ, నవ్య శ్రీను, పెద్దిరాజు, కిశోర్, తడికమళ్ల ప్రకాశ్రావు, నడ్డి ఆనందరావు, జిన్ని తదితరులు పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యేకు కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, చాంద్పాషా, నడ్డి జమలమ్మ, నాగుల్మీరా ఆధ్వర్యంలో భారీ బతుకమ్మలు, కోలాట నృత్యాలు, పూలవర్షంతో స్వాగతం పలికారు.