తల్లాడ, సెప్టెంబర్ 19 : స్థానిక బాలభారతి విద్యార్థి తాళ్లూరి ఉదయ్కిరణ్ జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లోగుర్తింపు పొంది ప్రశంసాపత్రాన్ని అందుకున్నాడు. ఈ నెల 17న ఢిల్లీలోని ప్రగతిభవన్లో పలువురు కేంద్ర మంత్రులు, ఇన్నోవేషన్ బృంద సభ్యులు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేందర్సింగ్ ఉదయ్కిరణ్కు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
ఉదయ్కిరణ్ చిల్లిబ్యాగ్ ఫిల్లింగ్ ప్రాజెక్టు ప్రదర్శనకు 8వ జాతీయ స్థాయి అవార్డు లభించింది. జాతీయ స్థాయి లో అవార్డు పొందిన ఉదయ్కిరణ్ను కేఎస్ఎం విద్యాసంస్థల కరస్పాండెంట్ కోటగిరి ప్రవీణ్, తాళ్లూరి రామారావు, అధ్యాపకులు అభినందించారు.