స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అనాథ, వృద్ధ ఆశ్రమాల్లో వృద్ధులు, అనాథలు చిన్నారులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్ర దవాఖానలో ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ రోగులు, గర్భిణులు, బాలింతలకు పండ్లు, స్వీట్లు పంచిపెట్టారు. కొత్తగూడెంలో స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో పండ్లు పాలు, రొట్టెలు కలెక్టర్ అనుదీప్ చేతులు మీదుగా అందజేశారు. జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు అందజేశారు. కొత్తగూడెం ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధుల ఆశ్రమానికి బియ్యం అందించారు.
మణుగూరులో ఫొటో గ్రాఫర్లు ఆసుపత్రిలో, వృద్ధాశ్రమంలో జడ్పీటీసీ పోశం నరసింహారావు వృద్ధులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట మండలాల్లో ఐసీడీఎస్ సీడీపీవోలు చిన్నారులకు పండ్లు పంపణీ చేశారు. దమ్మపేటలో గర్భిణులకు పాలు పండ్లు అందజేశారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్ ఏరియాల్లో కమిషనర్లు, వైద్యులు, అన్ని మండలాల్లో ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. – నెట్వర్క్