తల్లాడ, మార్చి 25 : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బిల్లుపాడు, గోపాలపేట గ్రామాల్లో టీఆర్ఎస్ సభ్యత్వం పొంది మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల బీమా చెక్కులను శుక్రవారం అందజేసి మాట్లాడారు. కార్యకర్తల సంక్షేమానికి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు నిత్యం కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. గోపాలపేటకు చెందిన దొబ్బల రమేశ్ ఇద్దరు కుమార్తెలకు రూ.25 వేల చొప్పున డిపాజిట్ చేస్తామని ఎమ్మెల్యే సండ్ర హామీ ఇచ్చారు.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం : నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామాలకు సౌకర్యాలను అందిస్తున్నానని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గోపాలపేటలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. గోపాలపేట ఆర్సీఎం చర్చి పునర్నిర్మాణం కోసం ఎమ్మెల్యే సండ్ర రూ.5 లక్షలను మంజూరు చేయించి అనుమతి పత్రాన్ని ఫాదర్ సురేశ్కు అందించారు.
26న తీర్మానాలను మోదీకి పంపిస్తాం ..: ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 26న గ్రామపంచాయతీలు, సొసైటీ కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పంజాబ్ తరహాలో వడ్లు కొనుగోలు చేసేలా ప్రధానిమోదీకి తీర్మానాలను పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, నాయ కులు రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, దూపాటి భద్రరాజు, శీలం కోటారెడ్డి, నల్లమోతు మోహన్రావు, రుద్రాక్షల బ్రహ్మం, బీ వీ ఆర్, కేతినేని చలపతి, కొమ్మినేని శ్రీనివాసరావు, కోసూరి వెంకటనరసింహారావు, నున్నా తిరుమలరావు, దొడ్డా చిన్నశ్రీను, కొమ్మినేని జ్యోత్స్న, మురళి, కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి టౌన్, మార్చి 25 : టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావును ఎమ్మెల్యే సండ్ర శుక్రవారం రామానగరానికి వెళ్లి పరామర్శించారు. చికిత్స నిమిత్తం యాగంటి సతీమణి రమాదేవికి ఎమ్మెల్యే రూ.లక్ష అందజేశారు. మున్సి పల్ వైస్ చైర్మన్ తోట సుజలారాణి రూ.10వేలను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, బాలాజీరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నాగయ్య, జాన్సన్, చంటి, తోట గణేశ్, పెద్దిరెడ్డి పురుషోత్తం, పెద్దిరాజు, సుంకర వాసు, సూరిబాబు, చిన్నంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి, మార్చి 25 : తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని సత్తుపల్లిలో ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. నాయకులు బండి అంజిరెడ్డి, ఎల్ఎస్.రెడ్డి, రామకృష్ణ, కిన్నెర వెంకటేశ్వరరావు, ఎస్కె.ఇమామ్, శేషగిరిరావు, రవి, దాసు, చారి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.