యష్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్-2’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 1000 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్నది. రాఖీభాయ్గా యష్ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నది. ఈ సినిమా సీక్వెల్కు సంబంధించిన తాజా అప్డేట్ వెలువడింది. ‘కేజీఎఫ్-2’ సినిమా ైక్లెమాక్స్లోనే మూడోభాగం ఉంటుందనే హింట్ ఇచ్చారు. ‘కేజీఎఫ్-3’ అక్టోబర్లో సెట్స్మీదకు వెళ్తుందని చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మార్వెల్ యూనివర్స్ తరహాలో వివిధ చిత్రాల్లోని హీరోలు ఈ భారీ ప్రాజెక్ట్లో భాగమవుతారని ఆయన పేర్కొన్నారు. విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ “ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్నీల్ ‘సలార్’ చిత్రాన్ని చేస్తున్నారు. అక్టోబర్లో షూటింగ్ పూర్తవుతుంది. ఆ వెంటనే ‘కేజీఎఫ్-3’ని మొదలుపెడతాం. చిత్రీకరణ పూర్తవడానికి సంవత్సరం పడుతుంది. భారీ హంగులతో మార్వెల్ యూనివర్సల్ తరహాలో ఈ సినిమాను డిజైన్ చేశాం. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా చేరువవుతుంది’ అని చెప్పారు.