హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అథారిటీ చైర్మన్ అధ్యక్షతన శుక్రవారం తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తిరుమల అభివృద్ధి పనుల నిధుల కేటాయింపుపై చర్చించారు. బర్డ్ చిన్నపిల్లల దవాఖానలో వైద్య పరికరాల కొనుగోలుకు రూ.2.3 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఇక నెల్లూరు జిల్లాలో సీతారామస్వామి ఆలయ నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరుకు నిర్ణయం తీసుకుంది.
త్రిదండి చినజీయర్ స్వామి సూచనల మేరకు 10 ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ.9 కోట్లు వినియోగించాలని చర్చించింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి 12 లక్షల డైరీలు, 8 లక్షల క్యాలండర్లు, 2 లక్షల చిన్నడైరీలు ముద్రించాలని, గ్రీన్ఎనర్జీ వినియోగం కోసం 35 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్