అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్లో త్వరలోనే భారీ మార్పులుంటాయని తెలిపారు. వందశాతం కొత్త వారినే తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారంటూ ప్రకటించారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు తెలిపినట్లు బాలినేని చెప్పారు. వందశాతం కేబినెట్ను మారుస్తానని సీఎం గతంలో చెప్పారని బాలినేని గుర్తు చేశారు. అయితే, మంత్రివర్గాన్ని వంద శాతం మారిస్తే మంచిదే తాను సీఎంకు చెప్పానని, తనను కూడా మార్చాలని చెప్పానని.. మంత్రి పదవి పోయినా భయం లేదని స్పష్టం చేశారు. తనకు పార్టీయే ముఖ్యమని, పదవులు కాదన్నారు.