తిరువనంతపురం: కేరళలో కరోనా వైరస్ ( Covid in Kerala ) ప్రభావం కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇవాళ కూడా కొత్తగా 16,671 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46,13,964కు పెరిగింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 120 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 24,248కి చేరింది. ఇక ఇవాళ మొత్తం 1,14,627 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులలో రికవరీలు, మరణాలు పోను ప్రస్తుతం 1,65,154 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ నమోదైన మొత్తం కేసులలో ఎర్నాకుళం జిల్లాలోనే అత్యధికంగా 2,500 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత తిరువనంతపురంలో 1,961 మంది, త్రిసూర్లో 1,801 మంది కరోనా వైరస్ బారినపడ్డారు.