తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదు. అక్కడ రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతున్నది. తాజాగా శుక్రవారం కూడా 11,546 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. రోజువారీ కరోనా రికవరీల సంఖ్య కూడా భారీగానే ఉంటున్నది. శుక్రవారం మొత్తం 11,056 మంది కరోనా బాధితులు ఆ మహమ్మారి బారినుంచి బయటపడ్డారు.
ఇక, సోమవారం కొత్తగా 118 మంది కరోనాతో మృతిచెందగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 12,699కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా 27,52,492కు పెరిగింది.