అమీర్పేట్: అమీర్పేట్ హోటల్ ఆదిత్య పార్క్లోని ప్రామినేడ్ రెస్టారెంట్లో శనివారం నుంచి కేరళ ఫుడ్ ఫెస్టివల్ ‘ఓనమ్ సద్య’ జరుగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను హోటల్ మేనేజర్ రాజు వెల్లడించారు. ఎంపిక చేసిన మళయాళీ రుచుల మేళవింపుతో రూపొందించిన వంటకాలను ఇక్కడ భోజన ప్రియులకు వండి వడ్డించనున్నారు.
సంప్రదాయ కేరళ రుచులైన వాజై అప్పర్, సర్కార వరాట్, పుటి ఇంజి, కడు మంగ, నిరంగ అచార్, మధుర కర్రి, వెల్లారి పచ్చడి, పజమ్ నురుక్కు, కేరళ పాపడ్, బనానా, పయారు థోరన్, అవియల్ కాలన్, ఓలన్, కూటు కర్రి, కైథా చక్కా పుసిళ్ళెరి, నీ పరుప్పు, సాంబార్, రసమ, సంబరమ్, అడ్ ప్రధమన్, చెరుపాయర్ ప్రధమన్ వంటి వెజిటేరియన్ రుచులను సంప్రదాయ పద్ధతిలో అరటి ఆకుపై వడ్డించనున్నారు.