హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, కేసీఆర్ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని దక్షిణ భారత రైస్మిల్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ర్టా లు రాజకీయ పలుకుబడి కోల్పోతున్న సందర్భంలో కేసీఆర్ జాతీయ పార్టీ నెలకొల్పడం మంచి పరిణామమన్నారు. దేశ రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర రావట్లేదని, కొంతమంది వ్యాపారుల కోసం విధానాలు మారుస్తున్నారంటూ కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. అన్ని ప్రాంతా లు, వర్గాల ఆదరణ చూరగొని కేసీఆర్ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆయన తెలిపారు.