తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో నవ శకం మొదలైంది. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది. దసరా పర్వదినాన తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటనపై ఉమ్మడి జిల్లా సంబురాల్లో మునిగితేలింది. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సహా అభిమానలోకం పెద్ద ఎత్తున రోడ్లపైకి తరలివచ్చి పటాకులు కాల్చి, స్వీట్లు పంచి ‘జై బీఆర్ఎస్.. జయహో కేసీఆర్’ అంటూ నినాదాలతో హోరెత్తించింది. జిల్లా కేంద్రాలతోపాటు మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూనే, ‘దేశ్కీ నేత.. కేసీఆర్’ అంటూ కీర్తించింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం దేశానికే శుభసూచకమని పేర్కొని ఆనందపడింది.
కరీంనగర్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): బీ(టీ)ఆర్ఎస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న సందర్భంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ బుధవారం చేసిన ప్రకటనపై ఉమ్మడి జిల్లా సంబురాలు హోరెత్తాయి. పల్లె, పట్టణం అనే తేడాలేకుండా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచి ఆనందపడ్డారు. జై బీఆర్ఎస్.. జయహో కేసీఆర్’ అంటూ నినదించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో స్థానిక మేయర్ వై సునీల్రావు ఆధ్వర్యంలో పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సంబురాలు చేసుకున్నారు. పార్టీ ఆవిర్భావ ప్రకటన వెలువడిన వెంటనే పటాకులు పేల్చారు. చొప్పదండి పట్టణంలో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. హుజూ రాబాద్, జమ్మికుంట పట్టణాల్లో కూడా బీ(టీ)ఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబు రాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. జమ్మికుంట మండలం వావిలాలపల్లి, విలాసాగర్లో చిగురుమామిడి మండల కేంద్రంలో, రామడుగు మండలం వెలిచాలలో, గన్నేరువరం, సైదాపూర్ మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.
పెద్దపల్లి: సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు
అలాగే సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో బీ(టీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ చైర్పర్సన్ అరుణ ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, రైతు బంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, బొల్లి రాంమోహన్ మహిళా విభాగం అధ్యక్షురాలు వనజ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.