దేశంలో సీఎం కేసీఆర్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతున్నది. రోజుకో రాష్ట్రంలో కేసీఆర్ ఫ్లెక్సీలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ప్రధాని నరేంద్రమోదీ ఇలాఖా వారణాసిలో కేసీఆర్ను పొగుడుతూ ఫ్లెక్సీలు దర్శనమివ్వగా, శుక్రవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో దేశవ్యాప్తంగా కేసీఆర్పై చర్చ నడుస్తున్నది. తెలంగాణలోలాగా సంక్షేమం దేశమంతా జరగాలనే కేసీఆర్ ఆకాంక్ష అందరినీ ఆకట్టుకొంటున్నది.