రవీంద్రభారతి, జూన్ 2: తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి పలువురు కవులకు ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న , ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ ఎన్.గోపి, కవులు అమ్మంగి వేణుగోపాల్, సలావుద్దీన్ నయ్యర్, కొట్ట వెంకటేశ్వర్రెడ్డి, అయినంపూడి శ్రీలక్ష్మి, జూపాక సుభద్ర పాల్గొన్నారు.