హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్రెడ్డి సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వం, పీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా సమర్పించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపారు. ఇన్నేళ్లుగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి హుజూరాబాద్ శాసన సభ స్థానానికి టికెట్ కూడా ఇచ్చి ప్రోత్సహించిన రాహుల్ గాంధీకి, ఉత్తమ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకొని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.