మైలార్దేవ్పల్లి: షార్ట్ సర్య్కూట్తో ప్లాస్టిక్ ,స్పాంజి కంపెనీలు కాలి బుడిదయిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కాటేదాన్ పారిశ్రామిక వాడలోని రజిని గుట్టపై ఉన్న శ్రీ వినాయక ఏజెన్సిస్ స్పాంజి కంపెనీ, మైసమ్మ ప్లాస్టిక్ గోడౌన్లలో ఆదివారం రాత్రి 10గం సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పులు చెలరేగి స్పాంజి కంపెనీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
దీంతో కంపెనీకి ఆనుకొని ఉన్న మైసమ్మ ప్లాస్టిక్ రా మెటీరియల్తో దాన తయారు చేసే కంపెనీకి వ్యాపించి నిప్పు అంటుకోవడంతో రెండు కంపెనీలు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. రాత్రి 11గం ల నుండి అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి చాల కష్టపడ్డారు. జేసీబీ సహాయంతో గొడౌన్ గోడలను కూల్చివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అప్పటికే అంత కాలి బూడిద అయ్యింది. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ప్లాస్టిక్ కంపెనీలో సుమారు 30లక్షల ఆస్తి నష్టం జరిగిందని కంపెనీ యజమాని వంశీగౌడ్ పేర్కొన్నారు.స్పాజి కంపెనీలో కూడా భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు.