ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ను ఖాతాలో వేసుకున్నాడు యువ నటుడు కార్తికేయ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఇపుడు చావు కబురు చల్లగా అంటూ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో లావణ్యత్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఎలాగైనా ఈ సినిమాతో ట్రాక్పైకి రావాలని చూస్తున్నాడు కార్తికేయ.
లావణ్యత్రిపాఠితో నటించడం పట్ల ఎక్జయిటింగ్ గా అనిపించడంతోపాటు కొంత భయపడినట్టు కార్తికేయ చెప్పాడు. లావణ్యత్రిపాఠి నాకు సీనియర్. మొదట ఆమెతో నటించాలన్నపుడు ఎక్జయిటింగ్ అనిపించింది మరోవైపు భయమేసింది. కానీ సెట్స్ లోకి వచ్చిన తర్వాత లావణ్య త్రిపాఠి కలుపుగోలుతనం చూసిన తర్వాత నాకు పెద్దగా సమస్య అనిపించలేదు. చావు కబురు చల్లగా సినిమా చుట్టూ చాలా ఆసక్తికర విషయాలున్నాయని చెప్పాడు కార్తికేయ.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.