కార్తికేయ, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అదిరిపోయే కామెడీ సీన్స్.. అద్భుతమైన ఎమోషన్..మంచి కథతో అన్ని కమర్షియల్ హంగులు అద్దుకున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శవాల వ్యాన్ నడిపే డ్రైవర్ గా కార్తికేయ అదిరిపోయే పాత్రలో కనిపించాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్, ఇంట్రోతో పాటు క్యారెక్టర్ వీడియోకు మంచి అప్లాజ్ వచ్చింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో డి గ్లామర్ రోల్ లో నటిస్తుంది. ట్రైలర్ లో వచ్చిన కొన్ని డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
“ఆకలి నిద్ర మూర్ఖత్వం ఇవి కాకుండా.. జాలి దయ మానవత్వం అంటే ఏంటో తెలుసారా నీ మనస్సాక్షికి..అమ్మాయిలందరూ ఎదవలకే పడతారంటారు..అందులో నేను నెంబర్ వన్.. నన్ను మించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది నీకు..” ఇందాక ఫోన్ లో చూసావే.. నాది యాక్టింగ్ మాత్రమే.. నువ్వు ఎక్కువ చేసావ్ అనుకో.. నీకు ఒరిజినల్ పడిపోద్ది..” అంటూ ట్రైలర్ లో వచ్చే డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
కొత్త దర్శకుడే అయినా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ హంగులు కౌశిక్ ఈ సినిమాలో బాగానే పొందుపరిచినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో వరస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్చి 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మార్చి 9న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 తర్వాత హీరోగా సక్సెస్ లేని కార్తికేయకు ఈ సినిమా కీలకంగా మారింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.