Karthikeya-2 Movie | గతవారం ‘బింబిసార’, ‘సీతారామం’తో కళకళలాడిన బాక్సాఫీస్ ఈ వారం ‘కార్తికేయ-2’తో ఫుల్ జోష్లో ఉంది. ఎన్నో వాయిదాల తర్వాత శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్ళను సాధిస్తుంది. లిమిటెడ్ స్క్రీన్లలోనే విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే దాదాపు రూ.5.2 కోట్ల వసూళ్ళు సాధించి నిఖిల్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. అంతేకాకుండా ఆదివారం నుండి థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షా బంధన్’ థియేటర్లను ఆక్యూపై చేస్తుంది. ఆదివారం బుకింగ్స్ మొదటి రోజుకు రెట్టింపుగా ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలానే కంటిన్యూ అయితే కార్తికేయ-2 ఫైనల్గా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్ను నిర్వహించింది.
ఈ సక్సెస్ మీట్లో నిఖిల్ మాట్లాడుతూ ‘కార్తికేయ-2 చిత్రానికి ప్రేక్షకులు వంద మార్కులు వేశారు. మూడేళ్ళు మేము పడిన కష్టాన్ని మర్చిపోయేలా చేశారు. విడుదలైన ప్రతిచోటు నుండి ఈ చిత్రానికి బ్లాక్ బాస్టర్ టాక్ వస్తుంది. యూఎస్ నుంచి వస్తున్న స్పందన మా అందరికి ఎంతో సంతోషాన్నిచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కింది. ఈ చిత్రంలో నిఖిల్కు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. అభిషేక్ అగర్వాల్ ఆర్స్ట్ పతాకంపై అభిషేక్ నిర్మించాడు.