బెంగళూరు : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కేబినెట్ను బుధవారం విస్తరించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. కొత్త మంత్రులు ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. మాజీ ముఖ్యమంతి యెడియూరప్పతో సంప్రదించిన తర్వాత కొత్త మంత్రుల పేర్లు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అయితే, యెడియూరప్ప తన పదవీ కాలంలో నియమించిన ఉప ముఖ్యమంత్రిని కొనసాగించాలనే నిర్ణయంపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.
ఈ క్రమంలో ఆయన పదవిలో కొనసాగిస్తారా? లేదంటే తప్పిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై బీజేపీ నాయకత్వం యెడియూరప్పతో చర్చిస్తుందని, అలాగే యెడియూరప్ప తనయుడు విజయేంద్ర పేరు సైతం కొత్త మంత్రుల జాబితాలో పేరున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కేబినెట్ మంత్రుల ఎంపికలో తాను జోక్యం చేసుకోనని మాజీ సీఎం ఇంతకు ముందే స్పష్టం చేశారు. తన వారసుడిని కొత్త ముఖ్యమంత్రి పార్టీ నాయకత్వంతో సంప్రదించి.. తీసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉందన్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణలో 20 నుంచి 25 మందితో మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.