Karnataka Minister Eshwarappa Resign | ఎట్టకేలకు కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారు. వివిధ కాంట్రాక్టులలో తనకు 40 శాతం వాటా ఇవ్వాలని కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ను మంత్రి ఈశ్వరప్ప డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
మంత్రి ఈశ్వరప్ప ఒత్తిళ్లు, బెదిరింపులు తాళలేక రెండు రోజుల క్రితం సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడటంతో కర్ణాటకలో రాజకీయ కలకలం చెలరేగింది. సంతోష్ పాటిల్ తన మరణ వాంగ్మూలంలో మంత్రి ఈశ్వరప్ప ఒత్తిళ్ల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ప్రకటించారు.దీంతో ఈశ్వరప్ప, ఆయన సన్నిహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈశ్వరప్పను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ భారీ ఆందోళనకు దిగింది. ఈశ్వరప్ప, ఆయన సన్నిహితులపై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో మంత్రికి సీఎం బసవరాజు బొమ్మై సమన్లు జారీ చేశారు. విపక్షాలు ఒత్తిడి పెంచడంతో మంత్రి ఈశ్వరప్పను రాజీనామా చేయాలని సీఎం బస్వరాజు బొమ్ము ఆదేశించారు. తొలుత మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయబోరని వార్తలొచ్చాయి.