బెంగళూరు: కర్ణాటకలో సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి రానుంది. రేపటి నుంచి కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. 10రోజులుగా విధించిన జనతా కర్ఫ్యూతో కరోనా కట్టడి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించనున్నట్లు ప్రకటించింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మే 24 ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ కొనసాగనుంది.
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 47,930 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 490 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 18,776కు పెరిగింది. ప్రస్తుతం 5,64,485 యాక్టివ్ కేసులున్నాయి.