హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత, కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇవాళ జాతీయ పార్టీకి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు నగరానికి చేరుకుంటున్నారు. మరో వైపు పలు రాష్ట్రాలకు చెందిన నేతలు సైతం తరలివస్తున్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రగతి భవన్కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన సమావేశమయ్యారు. ఆయనతో పాటు పలువురు జేడీయూ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు.
అలాగే తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమాళవన్ సైతం కేసీఆర్ను కలిశారు. ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి తిరుమాళవన్ ప్రగతి భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలతో సీఎం కేసీఆర్ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. మరికొద్దిసేపట్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభంకానున్నది. సర్వసభ్య సమావేశానికి 283 మంది ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. సమావేశంలో పార్టీ పేరుమార్పుపై తీర్మానం, సంతకాల సేకరణ చేపట్టనున్నారు.