పెద్దపల్లి టౌన్, సెప్టెంబర్ 21: కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న మోదీ సర్కారును గద్దెదించేందుకు లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఏకంకావాలని పిలుపునిచ్చారు. బుధవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. చాయి అమ్ముకునే నరేంద్రమోదీ దేశ ప్రధానీ కాగాలేనిది.. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడ్డ సీఎం కేసీఆర్ ప్రధాని కావడంలో తప్పేమున్నదని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17కు జీజేపీ, ఆర్ఎస్ఎస్కు ఏం సంబంధమున్నదో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలకు తెలియాజేయాలని డిమాండ్ చేశారు.
మునుగోడు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు బీజేపీ లేనిపోని ట్రిక్కులు చేస్తున్నదన్నారు. అక్కడి ఓటర్లు విజ్ఞులని బీజేపీ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్తో అక్టోబర్ 29న ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఇక్కడ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్, ప్రధాన కార్యదర్శి కుక్క చంద్రమౌళి, నాయకులు చొప్పదండి బుచ్చిలింగయ్య, దాసరి ఆనంద్, కొండ్ర స్వరూప, దేవ భా రతి, పొన్నం సత్తయ్య, లక్ష్మణ్, గంధం కిర ణ్, అంజయ్య, కాల్వల జితేందర్, కుక్క శ్రీనివాస్, బోంకూరి పోచం, ఇరుగురాల చంద ర్, చిప్పకుర్తి శివలింగం పాల్గొన్నారు.