పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 21: పెద్దపల్లి మం డలం కొత్తపల్లి-పెద్దపల్లి మధ్యలో మంగళవారం రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని మరణించిన ఇద్దరి కుటుంబాలకు 14లక్షల పరిహారం ఇవ్వనున్న ట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రకటించారు. బుధవారం ఆయన గోదావరిఖని ప్రభు త్వ దవాఖానలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతదేహాలను పరిశీలించి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం రైల్వే అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్తో ఐదు గంటలపాటు చర్చలు జరిపారు.
రైలు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 13.50 లక్షలు, దహన సంస్కారాలకు 50 వేల చొప్పున మొత్తం 14 లక్షలు ఇచ్చేలా ఒప్పించినట్లు తెలిపారు. రైలు ప్రమాదంలో మరణించిన పెద్దపల్లి మండలం పెద్దకల్వలకు చెందిన పెగడ శ్రీ నివాస్, ఎలిగేడు మండలం నర్సాపూర్కు చెందిన కాంపెల్లి వేణుకుమార్ కుటుంబ సభ్యులకు త్వరలోనే పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక్కడ ఎంపీపీ బండారిస్రవంతీ శ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పెద్దపల్లి సీఐ ప్రదీప్కుమార్, ట్రాఫిక్ సీఐ అనిల్కుమార్ ఉన్నారు. అలాగే మృతుల కుటుంబాలను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమనోహర్రెడ్డి, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి పరామర్శించారు.