సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తున్న పెద్దన్న కేసీఆర్పై ఆడబిడ్డలు అభిమానం చాటుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ మహిళా విభాగాల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీ కట్టే కార్యక్రమాలను శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కటౌట్లకు ఆడబిడ్డలు రాఖీలు కట్టి.. నిండు నూరేళ్లూ సల్లంగా ఉండాలని దీవించారు. తమ కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలుస్తున్న కేసీఆర్ వెంటే నడుస్తామని ప్రతిన బూనారు. అలాగే గురుకులాలు, కస్తూర్బాల్లోనూ వేడుకలు నిర్వహించగా, మంత్రి గంగుల కమలాకర్తోపాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎంతోపాటు అమాత్యుడు రామన్న కటౌట్లకు విద్యార్థినులు రాఖీలు కట్టారు.
కరీంనగర్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పెద్దన్నలా తమకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్పై మహిళలు అభిమానాన్ని చాటుకున్నారు. బొట్టు పెట్టి, రాఖీలు కట్టి ఆత్మీయతను చాటారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంత్రి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు బాలికల గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూళ్లను సందర్శించి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళా కార్పొరేటర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో సీఎం కేసీఆర్ కటౌట్కు రాఖీలు కట్టారు. ఇక్కడ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మేయర్ వై.సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో రాఖీ వేడుకలను మహిళా కార్పొరేటర్లు, మెప్మా సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్రావు హాజరవగా, వారికి రాఖీలు కట్టారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కటౌట్కు విద్యార్థులు, గ్రంథపాలకులు రాఖీలు కట్టారు. గంగాధర మండలం మధురానగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి రాఖీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టగా, ఎమ్మెల్యే వారితో కలిసి సెల్ఫీ దిగారు. ఎల్ఎండీకాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత సీఎం కటౌట్కు రాఖీ కట్టారు. చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకు డు బత్తుల వెంకటేశం నివాసం వద్ద సీఎం కేసీఆర్ విగ్రహానికి ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్రెడ్డి రాఖీ కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు.