కార్పొరేషన్, జూన్ 26: దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెచ్చిన దళిత బంధు తో దళితులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని, కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 44వ డివిజన్కు చెందిన లబ్ధిదారుడు మద్దూరి మాధ వి శ్రీధర్కు మంజూరైన కారును ఆదివారం మంత్రి నివాసంవద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గానికి 1500యూనిట్లు మంజూరు చేస్తామన్నా రు. సరైన మార్గంలో వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని లబ్దిదారులకు సూచించారు.
వెండింగ్ జోన్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి: మంత్రి గంగుల
నగరంలో చిరు వ్యాపారులకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఏర్పాటు చేస్తున్న వెండింగ్ జోన్ల అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఆదివారం డాక్టర్ స్ట్రీట్లో చేపడుతున్న నిర్మాణ ప నులను పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగానే 50 నుంచి 100 మంది చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకునే లా నగరపాలక సంస్థ నాలుగు చోట్ల వెండింగ్ జోన్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 43వ డివిజన్ డాక్టర్స్ట్రీట్లో నూతనంగా వెల్డింగ్ జోన్స్ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్లు సరిళ్ల ప్రసాద్, జంగిలి ఐలేందర్ యాదవ్, మహేశ్, మెండి శ్రీలత చంద్రశేఖర్, నాయకులు చల్ల హరిశంకర్, అంబేడర్ క్లబ్ ప్రతినిధులు కనమల్ల సుధీర్, గొర్రె శ్రీనివాస్, రాము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.