పెద్దపల్లి, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ)/పాలకుర్తి: ‘65 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ, ఎనిమిదేం డ్లు బీజేపీ అధికారంలో ఉండి చేసిందేంటో.. ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధేమి టో కండ్లముందున్నది. ఎవరు ఏం చేసిందీ.. చేస్తున్నది ప్రజలు గమనించాలి’ అని రాష్ట్ర ఎ స్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం, పాలకుర్తి మం డలాలకు చెందిన 150 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రా మగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాలకుర్తి మండల కేం ద్రంలో 120 మందికి ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ దేశంలో రో జురోజుకూ బీజేపీ ప్రతిష్ట మసకబారుతున్నద న్నారు.
తెలంగాణలో బాహుబలి కేసీఆర్ ఉన్నంతవరకు బీజేపీ, కాంగ్రెస్ ఆటలు సాగవని, ప్రతి నిమిషం పేదల కోసం తపించే మహానుభావుడు కేసీఆర్ అని మంత్రి కొనియాడా రు. టీఆర్ఎస్ అధికారంలోకి రాక ముందు గ్రామాలకు సరిగా రోడ్లు, డ్రైనేజీలు లేవని, వ్యవసాయానికి సాగు, తాగు నీరు లేదని, కేవలం మూడు గంటల కరెంట్తో గ్రామాల్లో అంధకారం నెలకొని ఉండేదని గుర్తుచేశారు.
వ్యవసాయాన్ని దండుగనే అనే పరిస్థితి నుంచి పండుగ స్థాయికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారని కొనియాడారు. కాళేశ్వరం నిర్మా ణం తర్వాత ఎక్కడ చూసినా నీళ్లతో రాష్ట్రంలో 26లక్షల నుంచి కోటీ 35లక్షల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. గ్రామాన్ని, మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్ష ఉన్న ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్వైపు చూస్తున్నారన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షే మం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాలతో పాటు ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో దివ్యాంగులకు రూ. 700, వృద్ధులకు రూ. 600 పిం ఛన్లు మాత్రమేనని, కానీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూ. 2వేలు, రూ. 3వేల పింఛన్లను ఇ స్తున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ఉచితాలు, సబ్సిడీలు, బంద్ చేయమంటున్నదని, సాగుకు 24గంటల విద్యుత్ వద్దంటున్నదని, మోటర్లకు మీటర్లు పెట్టి రైతుల దగ్గర బిల్లులు వసూలు చేయమంటున్నదని మండిపడ్డారు. కానీ సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో మో టర్లకు మీటర్లు పెట్టేది లేదని తేల్చిచె ప్పార న్నారు. దీంతో కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రప్రజలపై కక్ష గట్టి కిరికిరీలు చేస్తున్నారని విమర్శించారు.
ఈ రోజు దేశంలో వస్తు వు ల ధరలు పెరగానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని డీజిల్ రేట్ల పెంపుతో ప్రజలపై ఆర్థిక భా రం పడుతున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్ర భుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నదని విమర్శించారు. మన సింగరేణి బొగ్గును రూ. 4 వేలకు కొంటూ, అదానీకి అప్పజెప్పి రూ.26 వేలకు కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నదని విమర్శించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తూ, ప్రతి ఒక్కరి మోముపై ఆనందాన్ని చూడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారన్నారు.
జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు రేపు జరగబోయే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంపై మరో మారు గులాబీ జెండా ఎగరేసేలా కష్టపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆముల నారాయణ, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు కృపాకర్, పాలకుర్తి ఎంపీపీ వ్యాళ్ల అనసూర్యారాంరెడ్డి, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ప్యాక్స్ చైర్మన్ బయ్యపు మనోహ ర్రెడ్డి, తహసీల్దార్ వరందన్, ఎంపీడీవో లలిత, సర్పంచులు పల్లె అశోక్, గంధం లక్ష్మీనారాయ ణ, సుదగోని లావణ్య, పీట్ల గోపాల్ ఉన్నారు.