కొండగట్టు అంజన్న ఆలయంలో తాగునీటి సమస్య పరిష్కారం
మిషన్ భగీరథ ట్రయల్న్ నిర్వహించాం
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మల్యాల, మార్చి 27: కొండగట్టు అంజన్న సన్నిధిలో ఏప్రిల్ 27, జాన్ 4న నిర్వహించనున్న చిన్న, పెద్ద హనుమాన్ జయంత్యుత్సవాలకు సకల సౌకర్యాలు కల్పిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. శనివారం ఆయన కొండగట్టు దిగువన భగీరథ సంపు ను పరిశీలించారు. అధికారులతో కలిసి రెండు మోటర్లకు ట్రయల్ వెట్న్న్రు ప్రారంభించారు. కొండపైకి వెళ్లి భగీరథ జలాలను నెత్తిన చల్లుకొన్నారు. నీళ్లను తాగారు. అనంతరం సానా కాటేజ్లో అంజన్న సేవాసమితి, ఆలయ అధికారుల తో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కొండపైన 10 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల ట్యాంకులను నిర్మించా లని సూచించారు. ఇప్పటికే భగీరథ పథకం కింద నిర్మించిన సంపు, ఏర్పాటు చేసిన మోటర్ల కోసం ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలన్నారు.
కొండగట్టు ఘాట్రోడ్, ఆలయ మెట్లదారి నుంచి కొండపైకి, పిల్లల మర్రి (దొంగలమర్రి )నుంచి కొండగట్టు ఆలయం దాకా స్వాగత తోరణాలను ఏర్పాటు చేయాలన్నారు. 20 కాటేజ్లు, చలువ పందిళ్లు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆలయ ప్రాంగణంలో 100 అడుగులు, కొండ కింద పదిఫీట్ల హనుమాన్ విగ్రహాలను ఏర్పాటు చేస్తా మన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్రావు, సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, భగీరథ డీఈఈ నవీన్, జేఈ శ్రీహరి, ఆలయ ఏఈవో శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సు దర్శన్, మార్కెట్ కమిటీ చైర్మన్ జనగం శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలు ప్రవీణ్, జున్ను సురేందర్, ఆసం శివకుమార్, పుల్కం నర్సయ్య, కొంక నర్స య్య,నాయకులు ముత్యాల రాంలింగారెడ్డి, మధు సూదన్రావు, అంజయ్య, కోటేశ్వర్రావు, మ్యాక లక్ష్మణ్, సామల్ల దేవరాజం, గడికొప్పుల రమేశ్, పంజాల మల్లేశం,గుర్రపు మల్లేశం పాల్గొన్నారు.
పదకొండో రోజూ ఆఖండ పారాయణం..
అంజన్న సన్నిధిలో పదకొండోరోజైన శనివారం ఆఖండ హనుమాన్చాలీసా పారాయణం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కొనసాగింది. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు ప్రత్యేక వేదికపై ఆసీనులై పారాయణాన్ని పఠించారు. పూడూర్కు చెందిన అంజన్న భక్తమండలి, మల్యాలకు చెందిన మఠాంజనేయస్వామి ఆలయ భజన బృందం, ధర్మపురికి చెందిన అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి భజన మండలి, జగిత్యాలకు చెందిన వికాస తరంగిణి భజన మండలితోపాటూ కరీంనగర్కు చెందిన శ్రీనివాస్ కలిసి పారాయణ పఠనం చేశారు. అర్చకులు జితేంద్రప్రసాద్, చిరంజీవ స్వామి, కపిల్ ఉత్సవమూర్తులకు అభిషేకం, హారతి నిర్వహించారు.