ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
గంగాధర, ఏప్రిల్ 1: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానలో చికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 59 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.13 లక్షల ఒక వెయ్యి ఆర్థిక సాయం మంజూరైంది. గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్రావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సర్పంచులు వేముల దామోదర్, ఎండీ నజీర్, ముక్కెర మల్లేశం, మాల చంద్రయ్య, జోగు లక్ష్మీరాజం, రాసూరి మల్లేశం, ఆకుల శంకరయ్య, పొట్టల కనకయ్య, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, నాయకులు రేండ్ల శ్రీనివాస్, అలువాల తిరుపతి, వడ్లూరి ఆదిమల్లు, నిమ్మనవేణి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.