వేములవాడ టౌన్ : త్రిరాత్రోత్సవాల్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో నిర్వహించిన ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సోమవారం రాత్రి 8గంటలకు ఆలయ అర్చకులు డోలోత్సవం వైభవంగా నిర్వహించారు.
స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు అద్దాల మండపంలో పుష్పాలతో అందంగా అలంకరించిన డోలాలో శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారిని, శ్రీ లక్ష్మీసమేత అనంత పద్మనాభస్వామి వారిని పవళింపజేసి విశేష పూజలు చేసి డోలోత్సవం నిర్వహించారు.