రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతారా’. సప్తమి గౌడ నాయికగా నటించింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల అనువాదంగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్న సందర్భంగా హీరో రిషబ్ శెట్టి మాట్లాడుతూ…‘ఇది పాన్ ఇండియా మూవీ అనుకుని చేయలేదు.
సినిమాలోని సత్తానే దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఇవాళ తెలుగు, కన్నడ సినిమాలు ప్రాంతీయ హద్దులు దాటి ఇండియన్ సినిమాగా ఎదిగాయి’ అని అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ…‘మంచి చిత్రాలకు భాషా భేదాలు లేవని ఈ చిత్ర విజయంతో మరోసారి నిరూపితం అన్నారు.