అమరావతి: కరోనా ఉధృతి కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో స్వామివారి దర్శన వేళలను కుదిస్తున్నట్లు ఈవో వెంకటేశు తెలిపారు. ఆలయంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి దర్శనం కల్పించనున్నట్టు ఆయన చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్వామికి నిర్వహించే నివేదనలు, త్రికాల పూజలు, మహా హారతిని ఏకాంతంగా అర్చకులు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్వామికి నిర్వహించే పాలాభిషేకం, ప్రత్యేక అభిషేకం, గణపతి హోమం, నిత్యకల్యాణోత్సవానికి టికెట్లు తీసుకొన్న భక్తులు సేవల్లో పాల్గొన వచ్చునన్నారు.