న్యూఢిల్లీ : జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ నేత కన్హయ్య కుమార్తో పాటు గుజరాత్కు చెందిన దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ మంగళవారం కాంగ్రెస్లో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఇద్దరు నేతలు కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కన్హయ్య కుమార్ సీపీఐలో చేరారు. బిహార్లోని బేగుసరాయ్ నుంచి బీజేపీకి చెందిన గిరిరాజ్ సింగ్పై పోటీ చేసి ఓడిపోయారు. జిగ్నేష్ మేవాని ప్రస్తుతం గుజరాత్లో అసెంబ్లీలో శాసనసభ సభ్యుడు. వడ్గామ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన రాష్ట్రీయ దళిత అధికార మంచ్ (RDAM) కన్వీనర్గా కొనసాగుతున్నదారు. జిగ్నేష్ న్యాయవాది. సామాజిక కార్యకర్త, పాత్రికేయుడిగానూ సేవలందించారు.