Ponniyin Selvan Audio Launch | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘పొన్నియిన్ సెల్వన్’ ఒకటి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలుంటాయి. ప్రేమకథా చిత్రాలకే మణిరత్నం టేకింగ్ గాని, డీటేయిలింగ్ గాని ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటిది ఈ సారి ఏకంగా పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడంటే ఇంకా ఏ స్థాయిలో తన టేకింగ్ ఉండనుందో అని ప్రేక్షకులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఆడియో లాంఛ్ సెప్టెంబర్ 6న జరుగునుంది. అదే రోజున మేకర్స్ ట్రైలర్ను విడుదల చేయనున్నాయి. కాగా ఈ వేడుకకు గెస్ట్లుగా రజినీకాంత్, కమల్ హాసన్లు రానున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో నిజమెంతుందో గానీ ఒకే వేదికకు ఇద్దరు గొప్ప నటులు వస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. మొదటి భాగం సెప్టెంబర్ 30న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.