కమల్హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రమ్’. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. హీరో నితిన్ స్వీయ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. రాజ్కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై ఆర్.మహేంద్రన్తో కలిసి కమల్హాసన్ ఈ సినిమాను నిర్మించారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. సూర్య అతిథి పాత్రలో కనిపిస్తారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
శుక్రవారం అగ్ర హీరో రామ్చరణ్ థియేట్రికల్ ట్రైలర్ను విడుల చేశారు. ‘యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో కమల్హాసన్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది. గ్యాంగ్స్టర్స్ను కట్టడి చేయడానికి అండర్కవర్ పోలీస్ విక్రమ్ చేసిన ఆపరేషన్ ఏమిటన్నది ఉత్కంఠను పంచుతుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. కాళిదాస్ జయరామ్, నరేన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గిరీష్ గంగాధరన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, దర్శకత్వం: లోకేష్ కనకరాజ్.