చెన్నై: కమలహాసన్ ద్రోహకాల్ అనే హిందీ సినిమాను తెలుగులో ద్రోహి పేరుతో పునర్నిర్మించారు. ఇప్పుడు అదే టైటిల్ తన మక్కల్ నీతి మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీకి గుడ్ బై చెప్తున్నవారికి తగిలించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం అంటుకులేకుండా పోయింది. కోయంబత్తూరు నుంచి పోటీచేసిన కమల్ స్వయంగా చిత్తుగా ఓడిపోయారు. దాంతో లాభం లేదనుకుని కమల్ పార్టీ నుంచి ఒకరొకరుగా వెళ్లిపోతున్నారు. “నంబర్ టూ”గా భావించే మహేంద్రన్ అదేబాట పట్టడంపై కమల్ మండిపడ్డారు. మహేంద్రన్ను ద్రోహి అని నిందించారు. అసలు తానే మహేంద్రన్ను పార్టీ నుంచి బహిష్కరించాలనుకున్నారట. ఓ కలుపు మొక్క పోయినందుకు సంతేషంగా ఉందట. ఆరుగురు నాయకులు వెళ్లిపోయినట్టు ప్రకటన వెలువడిన రోజే పార్టీని నడుపుతున్న తీరు బాగాలేదంటూ మహేంద్రన్ జారుకోవడంతో కమల్కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. రాజకీయాలకు కొత్త కదా, పాపం.