ఖమ్మం : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ ఐదు వేల మంది లబ్ధిదారులకు రూ.5.21 కోట్ల లబ్ధి చేకూరిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ పథకాల వల్ల ఆడపిల్లల పెండ్లిళ్ల విషయంలో తల్లిదండ్రులకు కొండంత ధైర్యం వచ్చిందన్నారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం 53 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.53.06 లక్షల విలువైన చెక్కులను, సీఎంఆర్ఎఫ్ ద్వారా 43 మంది లబ్ధిదారులకు రూ.26.59 లక్షల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తనప్పటికీ వాటిని అధిగమించి పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలను నిర్విరామంగా అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వారనికే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.