జగిత్యాల : కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు దేశానికే ఆదర్శమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం జిల్లాలోని గొల్లపల్లి మండలం వైశ్య భవన్లో కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సదర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.
అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా మారిందని మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని మంత్రి సూచించారు.
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
పరిగిని సుందరంగా తీర్చిదిద్దుదాం