సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వేకు సీఐఐ ద్వారా మూడు ఇంధన సామర్థ్య యూనిట్ అవార్డులు వచ్చినట్లు ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు. కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్ల భవనాలతో పాటు హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ భవన్కు ఈ అవార్డులు వచ్చాయి. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ఇంధన నిర్వహణ-2022లో భాగంగా ఈ మూడు బహుమతులను అందించారు.
కాచిగూడ రైల్వేస్టేషన్కు ఇంధన సామర్థ్య యూనిట్ అవార్డు రావడం ఇది మూడోసారి . ఈ మేరకు 2022 సంవత్సరానికి నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డును కాచిగూడ రైల్వేస్టేషన్ భవనం తరపున హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్చంద్రయాన్, మిగతా వాటికి ఇతర అధికారులు అవార్డులు స్వీకరించారు.