హైదరాబాద్ : జర్నలిస్టుల బస్పాస్ గడువును ఆర్టీసీ మరో మూడు నెలలు పొడగించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువును పొడగించిన విషయం తెలిసిందే. ఈ నెల 30తో గడువు ముగియనున్న నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు ఆర్టీసీ పొడగించింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బస్పాస్ కౌంటర్లలో గడువు తీరిన పాస్ను అందించి, సర్వీస్ చార్జి చెల్లించి పాస్ను తీసుకోవాలని సూచించింది. కొత్త పాస్లు ఏడాది డిసెంబర్ 31 తేదీ వరకు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది.