అహ్మదాబాద్: మూడో టీ20లో భారత్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ జోస్ బట్లర్ ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేస్తున్నాడు. కేవలం 26 బంతుల్లోనే 4ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో అతనికిది 11వ అర్థసెంచరీ కావడం విశేషం.
ప్రతీ ఓవర్లో కనీసం ఒక బౌండరీ బాదుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. బట్లర్ ధనాధన్ బ్యాటింగ్తో ఇంగ్లాండ్ పవర్ప్లేలో 57 రన్స్ చేసింది. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 66 బంతుల్లో 79 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్ జేసన్ రాయ్(9) చాహల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. బట్లర్(50), డేవిడ్ మలన్(17) క్రీజులో ఉన్నారు.