అలంపూర్: దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి దేవీ శరన్నరాత్రి ఉత్సవాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. 7 వ తేదీన యాగశాల ప్రవేశంతో మొదలై సాయంత్రం 6గంటలకు ధ్వజారోహణం జరుగుతుంది. దసరా నవరాత్రుల్లో భాగంగా జోగుళాంబ మాత ఒక్కో రోజు.. ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శణమివ్వనుంది.
గురువారం శైలపుత్రి దేవీగా, 8వ తేదీ శుక్రవారం బ్రహ్మచారిణీ దేవీగా, 9వ తేదీ శనివారం రోజున చంద్రఘంటా దేవీగా, 10వ తేదీన కూష్మాండ దేవీగా,11 వ తేదీ స్కందమాతా దేవీగా, అదే రోజు కాత్యాయనీ దేవీగా,12వ తేదీ కాళికాదేవీగా అలంకరణ,13 వతేదీ మహాగౌరి దేవీగా,14వ తేదీ సిద్ధి దాత్రి దేవీగా భక్తులకు దర్శణమివ్వనుంది.
12వ తేదీ ఉదయం 10గంటలకు జోగుళాంబ అమ్మవారి కల్యాణం, సాయంత్రం సింహావాహన సేవ,13వ తేదీ బుధ వారం ఉదయం రథోత్స వం,14 మహార్ణవమి కాళరాత్రి పూజ,15వ తేదీ పూర్ణాహుతి, సాయంత్రం ధ్వజావరోహణ కార్యక్ర మాలతో శరన్నవ రాత్రి ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో వీరేశం, ఆలయ చైర్మన్ రవిప్రకాశ్గౌడ్ పెర్కొన్నారు.
14వ తేదీ గురువారం ఉదయం 9:30 గంటలకు వేంకటేశ్వర ఆలయంలో కల్యాణోత్సవం జరుగనుంది.15వ తేదీ ఉద యం వేంకటేశ్వరస్వామి శేష వాహన సేవ, యోగా నరసింహాస్వామి ఆలయంలో 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శర న్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. సాయంత్రం యోగా నారసింహా స్వామి ఉరేగింపు ఉంటుంది. కంచి కామక్షి ఆల యంలో కూడా శరన్నవరాత్రి ఉత్వవాలు నిర్వహిస్తారు.
మండల పరిధిలోని గుంధమల్ల గ్రామ శివారులో కృష్ణా, తుంగభద్రా నదుల సంగమం సమీపంలో వెలసిన బాలా ఝ్రూం ఝూంకారేశ్వరీదేవీ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్ శర్మ తెలిపారు.
ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే ఉత్స వాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. అదే విదంగా బైరాపురం గ్రామ శివారులో వెలసిన రాజరాజేశ్వరి ఆలయం, నిత్యభావన అశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.