లండన్: టీ20 వరల్డ్కప్, యాషెస్ సిరీస్లో ఆడటమే తన లక్ష్యమని ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ తెలిపాడు. పునరాగమనంలో తొందరపడేది లేదని స్పష్టం చేశాడు. దీర్ఘకాలంగా మోచేతి గాయంతో ఇబ్బందిపడుతున్న ఆర్చర్ మే 21 సర్జరీ చేయించుకున్నాడు. మోచేతి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు.
భారత్తో త్వరలో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్కు జట్టులోకి తిరిగిరావడానికి సిద్ధంగా ఉన్నానని
అయితే టీ20 ప్రపంచకప్, యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ తరఫున సత్తాచాటేందుకు వేసవిలో ఫిట్నెస్ మెరుగుపరచుకునేందుకు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని వివరించాడు.
‘మోచేతి ఆపరేషన్ తర్వాత నేనొక నిర్ణయానికి వచ్చాను. తొందరగా మళ్లీ జట్టులోకి రావాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్, యాషెస్లో ఇంగ్లాండ్ తరఫున ఆడటంపైనా ప్రధానంగా దృష్టిసారించాను. అవే నా లక్ష్యాలు కూడా. ఒకవేళ నేను అంతకుముందే పునరాగమనం చేసి భారత్తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్లో ఆడగలిగితే చాలా మంచిది. అలాజరగకపోతే వేసవిలో పక్కన కూర్చునేందుకు నేను సిద్ధంగా ఉన్నానని’ ఆర్చర్ డైలీ మెయిల్ కోసం రాసిన కథనంలో పేర్కొన్నాడు.