న్యూఢిల్లీ, ఆగస్టు 23: హిందూ దేవతలపై జేఎన్యూ వీసీ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్మశాన వాటికల్లో తిరుగుతూ, పరిమితమైన బట్టలతో.. మెడలో పాములు వేసుకొనే శివుడు బ్రాహ్మణుడు కాదని ఆమె అన్నారు. బహూశా శివుడు.. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవాడై ఉంటాడని పేర్కొన్నారు. ఆ మాటకొస్తే.. దేవతలెవరూ బ్రాహ్మణులు కాదన్నారు. క్షత్రియులే అధికులని వెల్లడించారు. మనుస్మృతి ప్రకారం.. మహిళలందరూ దళితులేనని, అలాంటప్పుడు.. దేవతలు బ్రాహ్మణుల కుటుంబంలో ఎలా పుట్టగలరని ప్రశ్నించారు. మనుస్మృతి ప్రగతి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు.