విద్యార్థుల ప్లేస్మెంట్స్కు ఎంవోయూ దోహదం
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8 : విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా జేఎన్టీయూ ముని క్యాంపస్ ప్రైవేటు లిమిటెడ్ (ఎంసీపీఎల్)తో మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకున్నది. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, ముని ఫౌండర్ డైరెక్టర్ భూపేశ్ డహేరియా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వర్సిటీ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని వీసీ తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం మంజూర్ హుస్సేన్, ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్ డైరెక్టర్ జే సురేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.