హైదరాబాద్ : జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ-హైదరాబాద్ (జేఎన్టీయూ-హెచ్) 2021-22 విద్యా సంవత్సరానికి ‘రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు’ కోసం అనుబంధ కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాలేజీలు యూజీసీ అటానమస్ స్టేటస్ కలిగిఉండాలి లేదా సంబంధిత బ్రాంచ్లో ఎ గ్రేడ్, ఎన్బీఏతో ఎన్ఐఏసీ ఉండాలి. దరఖాస్తు ఫారం, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు మార్గదర్శకాలు, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.jntuh.ac.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 26 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు చివరి గడువు.