శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ బండిపోరా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ సైన్యం ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఉత్తర కాశ్మీర్లోని బండిపోరాలోని చందాజీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు.. అక్కడికి చేరుకొని కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు శనివారం పుల్వామాలో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మసూద్ అజహర్ బంధువుతో పాటు ఇద్దరు పాక్ ఉగ్రవాదులు మృతి చెందారు.