న్యూఢిల్లీ: టటెలికం రంగ సంచలనం రిలయన్స్ జియో తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. తన బ్రాడ్ బ్యాండ్.. జియో ఫైబర్.. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చానెల్ డిస్కవరీ ప్లస్ కంటెంట్ను తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
జియో ఫైబర్, డిస్కవరీ ప్లస్ కంటెంట్ భాగస్వామ్యంతో డిస్కవరీ ప్లస్ సైన్స్, అడ్వెంచర్, ఫుడ్, లైఫ్ స్టైల్ యానిమేషన్ వంటి కంటెంట్ను జియోఫైబర్ వినియోగదారులు ఉచితంగా పొందవచ్చు. డిస్కవరీ ప్లస్ ప్లాట్ఫాం ప్రేక్షకుల కోసం నాన్-ఫిక్షన్ కంటెంట్ను అందిస్తుంది. హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీతో సహా పలు భాషల్లో కంటెంట్ను జియో ఫైబర్ యూజర్లు అందుకోవచ్చు.
కొత్త, ఇప్పటికే జియో ఫైబర్ వినియోగదారులు రూ.999తో పాటు దాని పై ప్లాన్ ఎంచుకుంటే మాత్రమే ఈ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. ఈ కొత్త భాగస్వామ్యం వల్ల జియోఫైబర్ కస్టమర్లు రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన ఇంటూ ది వైల్డ్ సిరీస్తో సహా ఇతర డిస్కవరీ నెట్వర్క్ ప్రీమియం షోలు పొందడానికి అవకాశం లభిస్తుంది.
అలాగే మ్యాన్ వర్సెస్ వైల్డ్, గోల్డ్ రష్, ఎక్స్పెడిషన్ అన్ నౌన్, 90 డే ఫైనాన్స్, హౌ ది యూనివర్స్ వర్క్స్ వంటి ప్రత్యేక కంటెంట్ చూడవచ్చు. వీటితో పాటు జియోఫైబర్ వినియోగదారులు వందే భారత్ ఫ్లైట్ ఐఎక్స్ 1344: హోప్ టు సర్వైవల్, సీక్రెట్స్ ఆఫ్ సినౌలి, మిషన్ ఫ్రంట్లైన్, సూపర్ సోల్, లడఖ్ వారియర్ తదితర సిరీస్లనూ పొందవచ్చు. ఇప్పటికే రిలయన్స్ జియో ఫైబర్ 14 సంస్థల ఓటిటీ కంటెంట్ను ఉచితంగా అందిస్తుంది.
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
పీఎస్యూల ప్రైవేటీకరణతోనే వృద్ధి రేటు పరుగులు : రాకేష్ జంఝన్వాలా
ఐసీఐసీఐ సంచలనం
వచ్చే ఏడాది వరకూ ఇంతే.. కొవిడ్-19 ఎఫెక్ట్పై మెజారిటీ సీఈవోలు
చందా కొచర్కు రిలీఫ్.. ఆమె భర్త దీపక్కు బెయిల్